జూన్ 21న ఏపీలో ఒక చరిత్ర సృష్టించబోతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. నేటి నుంచి నెలపాటు యోగాంధ్ర-2025 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏదో ఈవెంట్ కోసం యోగా దినోత్సవం చేయటం కాదు, అందరి జీవితాల్లో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో ప్రధాన సిద్ధాంతం హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. అందులో భాగంగానే యోగాని కూడా ప్రొమోట్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ రికార్డులు తిరగరాసేలా, విశాఖ తీరంలో యోగా దినోత్సవం చేస్తున్నాం. వచ్చే నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 2 కోట్ల మందికి తక్కువగాకుండా యోగా దినోత్సవంలో పాల్గొనాలన్నది సంకల్పమని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు