పటౌడీ ట్రోఫీ పేరును ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీగా మార్చిన సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా దీనిపై అధికారికంగా ఓ ప్రకటన చేయాల్సింది. అయితే అహ్మదాబాద్ విమాన దుర్ఘటన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ట్రోఫీ పేరును మార్చడంపై విమర్శలు వచ్చాయి. ట్రోఫీకి పటౌడీ పేరు సిరీస్ లో భాగంగా ఉండాలని కోరుతూ స్వయంగా సచినే ఈసీబీకి లేఖ రాశాడు. పటౌడీ పేరు సిరీస్ లో భాగంగా ఉండాలని సచిన్ ఈసీబీని కోరాడు. ఐసీసీ అధ్యక్షుడు జై షా కూడా చర్చల్లో పాల్గొన్నారు. విన్నింగ్ కెప్టెన్ కు పటౌడీ మెడల్ బహూకరించాలని ఈసీబీ నిర్ణయించిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ సిరీస్ గెలిచిన జట్టు కెప్టెన్ కు పటౌడీ మెడల్ ఇవ్వనున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు