టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులకు ఆలౌటయింది. జో రూట్ (40), బెన్ స్టోక్స్ (33), హ్యారీ బ్రూక్ (23), క్రాలీ (22) పరుగులు చేశారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పరుగులు కట్టడి చేశారు. వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో రాణించాడు. బుమ్రా 2 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా తలో వికెట్ చొప్పున పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్ ల్లో ఇరు జట్ల స్కోర్లు సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో భారత విజయ లక్ష్యం 193 పరుగులుగా ఉంది. ఇక రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. యశస్వీ జైశ్వాల్ (0), కరుణ్ నాయర్ (14), శుభ్ మాన్ గిల్ (6) నిరాశ పరిచారు. నైట్ వాచ్ మెన్ గా బరిలోకి దిగిన ఆకాష్ దీప్ (1) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం కే.ఎల్.రాహుల్ (33 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. భారత్ చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. విజయానికి ఇంకా 135 పరుగులు చేయాల్సి ఉంది. అయితే బౌలర్లకు పరిస్థితి అనుకూలంగా ఉన్న ఈ పిచ్ పై భారత బ్యాటర్లు కీలకంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు