రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో ఈసీ (ఎలక్షన్ కమీషన్)అక్రమాలకు పాల్పడిందిని ఆరోపించారు. ఈసీకి వ్యతిరేకంగా తమ దగ్గర ఆటంబాంబ్ లాంటి ఆధారాలున్నాయని అన్నారు. బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా మారుతున్నాయని ఒకే పేరు, ఒకే ఫోటో, ఒకే అడ్రస్ ఉన్న వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది.. ఇలాంటి ఓట్లు వేలల్లో ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఇక ఆయన వ్యాఖ్యలకు ఈసీ కూడా కౌంటర్ ఇచ్చింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. అక్రమాలు జరిగాయని భావించినా అనుమానాలు ఉన్నా కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చని పేర్కొంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని భావిస్తే ఆధారాలు చూపించాలని ఎన్నికల అక్రమాలపై అనుమానాలు ఉంటే లిఖితపూర్వక ఫిర్యాదు చేయండని ఎన్నికల కమిషన్ కౌంటర్ ఇచ్చింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు