పెర్త్ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టు రెండో రోజు ఆటలో భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. రెండో రోజు 67-7తో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ అలెక్స్ క్యారీ (21), స్టార్క్ (26) లైయాన్ (5) వికెట్లు కోల్పోయి 104 పరుగులకు ఆలౌటయింది. దీంతో భారత్ కు మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. బుమ్రా 5 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, హార్షిత్ రాణా 3వికెట్లు పడగొట్టారు. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎదుర్కొని పటిష్ట స్థితిలో నిలిచింది. ఆట ముగిసే సమయానికి యశస్వీ జైశ్వాల్ 90నాటౌట్ (193 బంతులు 7×4, 2×6), కే.ఎల్.రాహుల్ 62 నాటౌట్(153 బంతులు 4×4) వికెట్ నష్టపోకుండా ఆస్ట్రేలియా బౌలర్లను ఓపికగా ఆడుతూ పరుగులు రాబట్టారు. దీంతో భారత్ ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు