ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అద్భుతమైన గెలుపును సాధించి 2వ సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తన యంత్రాంగంలో భారతీయులకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే పలు భారత సంతతి వ్యక్తులను ముఖ్యమైన పదవుల్లో నియమించిన ఆయన తాజాగా…అత్యంత కీలకమైన ఎఫ్బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) డైరెక్టర్గా ఇండో-అమెరికన్ అయిన కాష్ పటేల్ ను నామినేట్ చేశారు.
అయితే ట్రంప్కు అత్యంత విధేయుడిగా కాష్ను చెప్పుకుంటారు.ఈస్ట్ ఆఫ్రికా నుండి వచ్చి న్యూయార్క్లోని క్వీన్స్లో స్థిరపడిన గుజరాతీ మూలాలున్న కుటుంబంలో కాష్ పటేల్ జన్మించారు.ఆయన లా పూర్తి చేసిన తర్వాత ఫ్లోరిడాలో పబ్లిక్ డిఫెండర్గా పనిచేశారు.ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్లో న్యాయవాదిగా చేరారు. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్లో సివిల్ లాయర్గా చేరిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది.కాష్ తెలివైన లాయర్,పరిశోధకుడని ట్రంప్ ప్రశంసించారు.అమెరికాలో అవినీతిని బహిర్గతం చేయడం, న్యాయాన్ని, అమెరికన్లను రక్షించేందుకు ఆయన తన కెరియర్ను అంకితం చేశారని తన సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ట్రూత్’లో కొనియాడారు.తన మొదటి పదవీకాలంలో పటేల్ అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.క్రిస్టోఫర్ 2017లో ఎఫ్బీఐ చీఫ్గా నియమించారు.