బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రత విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
డిమాండ్ చేశారు.బంగ్లాదేశ్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆమె స్పందిస్తూ…బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.తాజాగా మరో ముగ్గురు హిందూ సన్యాసులను అరెస్టు చేశారు.మనకు బంగ్లాదేశ్లో కుటుంబాలు,ఆస్తులు,మనకు ఇష్టమైనవారు ఉన్నారు.దీనిపై భారత ప్రభుత్వం ఎలాంటి వైఖరిని అవలంబించినా మేము అంగీకరిస్తాము.అయితే ప్రపంచంలో ఎక్కడైనా సరే మతపరంగా జరిగే దురాగతాలను మేము ఖండిస్తూనే ఉంటాము.బంగ్లాదేశ్ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి,ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నామని మమతా బెనర్జీ అన్నారు.
కోల్కతా శాఖకు చెందిన ఇస్కాన్ చీఫ్తో మాట్లాడి సానుభూతిని,మద్దతును తెలిపినట్లు మమత పేర్కొన్నారు.బంగ్లాదేశ్లో భారతీయులపై దాడి జరిగితే దాన్ని తాము సహించలేమని అన్నారు.తాము తమ ప్రజలను తిరిగి తీసుకురాగలమని చెప్పారు.భారత ప్రభుత్వం ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువెళ్లవచ్చని,యూఎన్ శాంతి పరిరక్షక దళాన్ని పంపవచ్చని అన్నారు.