ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. పార్లమెంటు ముందు రాహుల్ తమాషా చేశారని విమర్శించారు. రాహుల్ గాంధీ తాజాగా ప్రధాని మోడీ, పారిశ్రామిక వేత్త అదానీ మాస్క్ లతో ఉన్న వ్యక్తులను ఇంటర్వూ చేయడంపై కిరణ్ రిజిజు ఈవిధంగా స్పందించారు. రాహుల్ గాంధీకి ప్రజల బాధలు పట్టవని అయితే మిగిలిన ఎంపీలు అలా కాదని తమను గెలిపించిన ప్రజలపై తమకు బాధ్యతలున్నాయని అన్నారు. రాహుల్ ప్రధానిని అవమానపరుస్తూ తమాషా చేశారని విమర్శించారు. ఇలాంటివి చేయడం సెలవులు ఆనందించడానికి విదేశాలకు వెళ్లడం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సమాజ్వాదీ పార్టీ, టిఎంసి, రాజ్యసభలోని కాంగ్రెస్ ఎంపీలందరూ, లోక్సభలో కొందరు కాంగ్రెస్ ఎంపీలు & చాలా మంది పార్టీ ఎంపీలు పార్లమెంటు చర్చలలో పాల్గొనేందుకు నిజంగా ఆసక్తి చూపుతున్నారని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు