Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » మోడీ ప్రభుత్వం వచ్చాకే బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు: రాహుల్ వ్యాఖ్యలకు నిర్మలా సీతారామన్ కౌంటర్
    జాతీయం & అంతర్జాతీయం

    మోడీ ప్రభుత్వం వచ్చాకే బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు: రాహుల్ వ్యాఖ్యలకు నిర్మలా సీతారామన్ కౌంటర్

    By adminDecember 12, 20241 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    యూపీఏ ప్రభుత్వ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. తమ మిత్రుల కోసం మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను అపరిమిత నిధుల వనరుగా ఉపయోగించడం ఆపాలని చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ కు చెందిన ప్రతినిధులతో రాహుల్ గాంధీ సమావేశమయైన నేపథ్యంలో రాహుల్ కేంద్రం పై విమర్శలు చేశారు. ఈమేరకు‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా బదులిచ్చారు. ఆమె ‘ఎక్స్’ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు.
    రాహుల్ వ్యాఖ్యలు కష్టపడి పనిచేసే ఉద్యోగులు మరియు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలను అవమానించడమేనని అన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అమితాసక్తి అని అన్నారు. ఇక ప్రధాని మోడీ నేతృత్వంలో భారత ప్రభుత్వ రంగం మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులు గణనీయమైన అభివృద్ధిని సాధించినట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వం వచ్చాకే బ్యాంకింగ్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చినట్లు తెలిపారు.
    యూపీఏ ప్రభుత్వ పాలనలో విచక్షణా రహితంగా కార్పోరేట్ లోన్స్ మంజూరు చేయడం వల్ల బ్యాంక్ లు క్షీణించాయని విమర్శించారు. తమ వారి కోసం బ్యాంకులను ఏటీఎంల వాడుకున్నారని అప్పటి యూపీఏ పాలనను దుయ్యబట్టారు. ఉద్యోగులను వేధించారని మండిపడ్డారు. రూ.3.26 లక్షల కోట్లు గత పదేళ్ళలో బ్యాంకులకు మూలధనం గా ఇచ్చినట్లు పేర్కొన్నారు. 54 కోట్ల జన్ ధన్ ఎకౌంట్లు, పీఎం స్వానిధి, ముద్రా, విశ్వకర్మ వంటి పధకాల ద్వారా తనఖా లేని లోన్స్ మంజూరు చేసిన అంశాన్ని వివరించారు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఆసక్తికరంగా ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్:13వ రౌండ్ డ్రా
    Next Article జగన్ పాలనలో ఏ రోజైనా రైతులకి సక్రమంగా డబ్బులు చెల్లించారా?: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.