భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. వర్షం కారణంగా మొదటి రోజు కొద్దిసేపు మాత్రమే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక నేడు ఓవర్ నైట్ స్కోర్ 28-0తో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. ట్రావిస్ హెడ్ 152 (160 బంతుల్లో, 18×4 )మరోసారి సెంచరీతో రాణించాడు. ఈ సిరీస్ లో వరుసగా రెండో సెంచరీ చేశాడు. మరో బ్యాటర్ స్టీవ్ స్మిత్ 101 (190; 12×4) కూడా రాణించడంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో మంచి ప్రదర్శన కనబరిచింది. భారత బౌలర్లలో బుమ్రా మరోసారి 5 వికెట్లతో సత్తా చాటాడు. నితీష్ రెడ్డి, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఆస్ట్రేలియా బ్యాటింగ్:
ఉస్మాన్ ఖవాజా 21 (54; 3×4) (సి) పంత్ (బి) బుమ్రా
నాథన్ మెక్స్వీనే 9 (49;1×4) (సి) కోహ్లీ (బి) బుమ్రా
మార్నస్ లబుషేన్ 12 (55) (సి) కోహ్లీ (బి) నితీష్ రెడ్డి
స్టీవ్ స్మిత్ 101 (190; 12×4) (సి) రోహిత్ శర్మ (బి) బుమ్రా
ట్రావిస్ హెడ్ 152 (160, 18×4 ) (సి) పంత్ (బి) బుమ్రా
మిచెల్ మార్ష్ 5 (16) (సి) కోహ్లీ (బి) బుమ్రా
అలెక్స్ క్యారీ 45 బ్యాటింగ్ (47; 5×4, 1×6)
పాట్ కమ్మిన్స్ 20 (33;1×4) (సి) పంత్ (బి) సిరాజ్
మిచెల్ స్టార్క్ 7 బ్యాటింగ్ (7)
మొత్తం 405-7 (101 ఓవర్లు)
భారత బౌలింగ్:
బుమ్రా 5 వికెట్లు, నితీష్ రెడ్డి 1 వికెట్, సిరాజ్ 1 వికెట్.