నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటించిన “డాకు మహారాజ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగాల్సి ఉండగా అది రద్దు చేసినట్టు టీమ్ ప్రకటించింది. తిరుపతి ఘటన నేపథ్యంలో టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది.తిరుపతిలో జరిగిన ఘటనకు మా చిత్రబృందమంతా ఎంతో బాధ పడుతోంది.పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం హృదయ విదారకంగా ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం సరికాదని భావిస్తున్నాం…బాధాతప్త హృదయంతో,భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అత్యంత గౌరవంతో నేడు జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం..ఈ సమయంలో మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఇందులో ప్రగ్య జైస్వాల్,ఊర్వశి రౌతేలా కథానాయకులుగా నటితున్నారు.జనవరి 12 న విడుదల కానుంది.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు