సినిమా అభిమానాలు అంత ఎప్పుడూ…ఎప్పుడూ అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఎస్ఎస్ఎంబీ 29.అయితే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి,మహేష్ బాబు కలయికలో వస్తోన్న గ్లోబల్ అడ్వెంచరస్ ఈ చిత్రం తెరకెక్కుతుంది.ఈ ప్రాజెక్ట్లో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుందని తెలిసిందే.
అయితే ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరగనున్నట్లు సమాచారం.తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది.ప్రియాంకా చోప్రా షూటింగ్ నుండి బ్రేక్ తీసుకుందని తెలుస్తుంది.శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించింది ప్రియాంకా చోప్రా.తాజా సమాచారం ప్రకారం స్వల్ప విరామం తీసుకున్నట్లు చెబుతున్నారు.ప్రియాంకా చోప్రా తన సోదరుడు సిద్దార్థ్ చోప్రా వెడ్డింగ్ కోసం ముంబై వెళ్లిందని సమాచారం.
అయితే ప్రియాంకా చోప్రా లేనప్పటికీ షూటింగ్కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాజమౌళి మహేష్ బాబుపై వచ్చే ట్రాక్ను షూట్ చేస్తున్నాడని సమాచారం.కాగా త్వరలోనే వెడ్డింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్కు తిరిగొస్తుందని…ఆ వెంటనే ఆమె చిత్రీకరణలో పాల్గొంటారని తెలుస్తోంది.
ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్గా రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు.అయితే ప్రియాంక ఈ చిత్రానికి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.ఈ సినిమా కోసం ప్రియాంకా చోప్రా ఏకంగా రూ.30 కోట్లు తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.