పవర్ స్టార్ పవన్కల్యాణ్ ,నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం “హరిహర వీరమల్లు”.ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.గతంలో ఈ చిత్రం 60 శాతం వరకు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించగా కొన్ని అనివార్య కారణాలు వలన ఆయన ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ చివరిదశలో ఉంది.తాజాగా ఈ చిత్రం గురించి నిధి అగర్వాల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్లో పాల్గొన్న ఆమె సినిమా చిత్రీకరణ చాలా వరకూ పూర్తైందన్నారు.ప్రేక్షకులకు తప్పకుండా ఇది నచ్చుతుందని చెప్పారు.పవన్కల్యాణ్ గారితో వర్క్ చేయడం గొప్ప అనుభవం అని నటి నిధి అగర్వాల్ అన్నారు.ఆయన నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆమె చెప్పారు.మార్చి 28న విడుదల కానుంది.రెండు భాగాలుగా ఈ చిత్రం సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

