అమెరికా ప్రముఖ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ సంచలన ప్రకటన చేశారు.ఈ మేరకు ఆయన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థను మూసివేస్తున్నట్లు తెలిపారు.నేను హిండెన్బర్గ్ రీసెర్చ్ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాను.మేము పని చేస్తున్న కొన్ని ప్రాజెక్టులు పూర్తయిన అనంతరం సంస్థ మూసివేయబడుతుందని హిండెన్బర్గ్ వెబ్సైట్లోని ఓ నోట్లో నాథన్ అండర్సన్ వెల్లడించారు.
అయితే ఈ నిర్ణయం వెనక ఎటువంటి భయాలువ్యక్తిగత సమస్యలు,అనారోగ్య కారణాలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు.అయితే హిండెన్బర్గ్ ను నాథన్ అండర్సన్ 2017లో ప్రారంభించారు.అయితే హిండెన్బర్గ్ నివేదికలతో భారత్లోని అదానీ గ్రూప్ తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే.2022, 2024లో అదానీ గ్రూప్ను లక్ష్యంగా చేసుకుని హిండెన్బర్గ్ సంస్థ విడుదల చేసిన నివేదికలు సంచలనం సృష్టించాయి.