కర్ణాటకలో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి.నిన్న బీదర్లో ఏటీఎం సెంటర్కు డబ్బులు తరలిస్తున్న సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపి రూ. 93 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన మరువక ముందే తాజాగా దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్ పట్టణంలో పట్టపగలే బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డారు.కో ఆపరేటివ్ బ్యాంకులో చొరబడ్డ ఐదుగురు వ్యక్తులు భారీగా బంగారం,నగదును ఎత్తుకెళ్లారు.తుపాకులతో బ్యాంకు లోకి వచ్చిన వ్యక్తులు సిబ్బందిని బెదిరించి ఈ చోరీకి పాల్పడ్డారు. రూ. 15 కోట్ల విలువైన బంగారం, రూ. 5 లక్షల నగదును దొంగలు అపహరించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.దోపిడీ అనంతరం వాళ్ళు మంగళూరు వైపు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.అయితే వారి వద్ద ఉన్న తుపాకులు చూసి భయపడి దొంగలను వెంబడించ లేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు