దేశంలో మొదటి కుత్రిమ మేధస్సు (ఏఐ) విశ్వవిద్యాలయాని మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది.కాగా ఈ ప్రాజెక్టు అమలు కోసం వివిధ రంగాల నిపుణులతో ఓ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైనట్టు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆశిష్ షేలర్ తెలిపారు.అయితే మహారాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో ఐఐటీ ముంబై, ఐఐఎం ముంబై డైరెక్టర్లు, గూగుల్ ఇండియా, మహీంద్రా గ్రూప్, ఎల్అండ్టీ లాంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు, రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిషన్, డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిపుణులు సభ్యులుగా ఉన్నట్లు వెల్లడించారు.ఈ మేరకు ఇప్పటికే 2 సార్లు భేటీ అయినా ఈ కమిటీ.. ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం తుది రోడ్మ్యాప్ను తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు.
Previous Articleలోక్ సభలో గందరగోళం…!
Next Article హిందూపురం మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తెలుగు దేశం