బ్రెజిల్లో జరిగిన వేలంలో మన దేశీ ఆవు అయిన నెల్లూరు జాతి (ఒంగోలు జాతి అని కూడా పిలుస్తారు ) ఆవు రికార్డు స్థాయిలో ధర పలికింది. 4.8 మిలియన్ డాలర్లు అంటే మన రూపాయలలో దాదాపు రూ. 40 కోట్లు. ఈ రేంజ్ లో ధరతో గిన్నిస్ రికార్డులకెక్కింది. బ్రెజిల్లోని మినాస్ గెరైస్లో నిర్వహించిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా-19 అనే ఆవును వేలం వేయగా ఓ వ్యక్తి దానిని ఈభారీ మొత్తానికి కొనుగోలు చేశారు. అత్యధిక వెల పలికిన వియాటినా-19 గోవుగా ప్రసిద్ధి చెందిన ఈ ఆవు ఇంతకుముందు కూడా పలు రికార్డులు నెలకొల్పింది. కండరాల నిర్మాణం, అత్యంత అరుదైన జన్యువులు కలిగి ఉన్నందుకు గానూ ఇది ‘చాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్’లో ‘మిస్ సౌత్ అమెరికా’ అవార్డు అందుకుంది. ఈ ఆవు అండాలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతుండడం గమనార్హం. అధిక ఉష్ణోగ్రతా పరిస్థితులను కూడా తట్టుకుని ఇవి మనుగడ సాగించగలవు. 1800 సంవత్సరాల్లో ఈ జాతి ఆవులు బ్రెజిల్కు ఎగుమతి అయ్యాయి. వీటిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.
4.8 మిలియన్ డాలర్ల ధర పలికి గిన్నిస్ రికార్డుకెక్కిన నెల్లూరు జాతి ఆవు
By admin1 Min Read