మహారాష్ట్ర ఎన్నికలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు సంధించారు. మహారాష్ట్రలో 5 సంవత్సరాలలో కంటే 5 నెలల్లో ఎక్కువ మంది ఓటర్లను ఈసీ ఎందుకు చేర్చింది? మహారాష్ట్రలోని మొత్తం వయోజన జనాభా కంటే 2024లో ఎక్కువ మంది ఓటర్లు ఎందుకు ఉన్నారు? అని ప్రశ్నించారు. అలాగే తమకు ఉన్న అనుమానాలు లో ఒక దానిని అడుగుతున్నాం ఉదాహరణకు కమ్తీ నియోజకవర్గం, ఇక్కడ బీజేపీ సాధించిన ఓట్లు దాదాపుగా జోడించబడిన కొత్త ఓటర్ల సంఖ్యకు సమానమని పేర్కొన్నారు. ఈసీ తప్పనిసరిగా ఈ ప్రశ్నలకు సమాధానమివ్వాలి మరియు 2024 లోక్ సభ ఎన్నికలు మరియు 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండింటి యొక్క మహారాష్ట్ర ఓటర్ల జాబితాలను తమకు అందించాలని కోరారు.
Our questions to the Election Commission on the Maharashtra elections:
– Why did EC add more voters in Maharashtra in 5 months than it did in 5 years?
– Why were there more registered voters in VS 2024 than the entire adult population of Maharashtra?
– One example among many… pic.twitter.com/K7fOWdnXmV
— Rahul Gandhi (@RahulGandhi) February 7, 2025