రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే హవా అని టెక్ నిపుణులు ఎప్పటి నుండో చెబుతున్నారు.అయితే ఇప్పటికే చాట్ జీపీటీ,గూగుల్ జెమిని,చైనా డీప్ సీక్,మెటా ఎల్ఎల్ఏఎంఏ వంటి మోడళ్లు ఏఐ రంగంలో ఉన్నాయి.కాగా ఎలాన్ మస్క్ కు చెందిన ఎక్స్ ఏఐ కూడా ఈ రేసులో ఉంది.అయితే ఎలాన్ మస్క్ చెందిన ఎక్స్ గ్రోక్ ఏఐ మోడల్ ను గత ఏడాది తీసుకువచ్చింది.తాజాగా ఈ మోడల్ ను మరింత అభివృద్ధి చేసిన గ్రోక్-3 ను తీసుకువస్తున్నారు.తాజాగా ఈ అంశంపై ఎలాన్ మస్క్ స్పందించారు.గ్రోక్-3 అంతటి తెలివైన ఏఐ చాట్ బాట్ భూమ్మీద మరొకటి లేదని అన్నారు.రేపు ఉదయం 9.30 నిమిషాల నుండి అందుబాటులోకి రానుందని తెలిపారు.తాజాగా ఈ గ్రోక్-3లో టెక్ట్స్ టు వీడియో ఫీచర్ కూడా ఉంటుందని సమాచారం.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు