భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ శక్తి కాంత్ దాస్ కు కీలక పదవి దక్కింది. ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా అవకాశం లభించింది. ప్రధాని మోడీ పదవీకాలంతో పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు కేంద్ర నియామకాల కేబినెట్ తెలిపింది. 1980 బ్యాచ్ కు చెందిన శక్తి కాంత్ దాస్ ఆరేళ్ల పాటు ఆర్.బీ.ఐ గవర్నర్ గా సేవలందించారు. అంతకుముందు రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల విభాగాల్లో సెక్రటరీగా ఉన్నారు. పదవీవిరమణ అనంతరం 15వ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ఇక ప్రస్తుతం ప్రధాని మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా గుజరాత్ ఐఏఎస్ క్యాడర్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీకే మిశ్రా ఉన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు