టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు, మాజీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ షామా మొహమ్మద్ బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసింది.అయితే రోహిత్ శర్మ చాలా లావుగా ఉంటాడని,ఆయన బరువు తగ్గాల్సిన అవసరం ఉందని తన సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది.అంతేగాక రోహిత్ ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడని,సచిన్,ద్రవిడ్, గంగూలీ, కోహ్లీ, ధోనీలతో పోల్చితే ఆయన జస్ట్ యావరేజ్ ఆటగాడని విమర్శించారు.ఇప్పటివరకు భారత జట్టు కెప్టెన్లుగా బాధ్యతలు నిర్వహించిన వారిలో అంతగా ఆకట్టుకోలేని కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమేనని షామా విమర్శించింది.అయితే ఈ మ్యాచ్లో భారత్ 44 పరుగుల తేడాతో గెలిచింది.అయినా షామా మహ్మద్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం సంచలనం రేపింది.
#WATCH | On her comment on Indian Cricket team captain Rohit Sharma, Congress leader Shama Mohammed says, "It was a generic tweet about the fitness of a sportsperson. It was not body-shaming. I always believed a sportsperson should be fit, and I felt he was a bit overweight, so I… pic.twitter.com/OBiLk84Mjh
— ANI (@ANI) March 3, 2025

