నందన్ కానన్ ఎక్స్ప్రెస్ రైలు న్యూ ఢిల్లీ నుండి ఒడిశాలోని పూరికి బయల్దేరింది.ఈ రైలు యూపీలోని చందౌలీ లో గల పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ సమీపంలోకి రాగానే రెండుగా విడిపోయింది.ఈ మేరకు రైలు కప్లింగ్ విరిగిపోవడంతో S-4, S-5 కోచ్లు రెండుగా విడిపోయాయని తెలుస్తుంది.దీనితో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వెంటనే అప్రమత్తమైన అధికారులు చర్యలు చేపట్టారు.కాగా విడిపోయిన బోగిలోని ప్రయాణికులను మరొక కోచ్కు తరలించారు.సుమారు 4 గంటలు శ్రమించి సమస్యను పరిష్కరించారు.అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.ఆ సమయం ప్రయాణిస్తున్న రైలు వేగం తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు.
#WATCH | Chandauli, Uttar Pradesh: The coupling of the Nandan Kanan Express broke near the Pandit Deen Dayal Upadhyaya (DDU) Junction, splitting it into two parts. pic.twitter.com/QjqUHN7tfe
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 4, 2025