భారత సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్థాన్ డ్రోన్ ఎటాక్స్ చేయగా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ గుజరాత్ లోని 36 ప్రాంతాలను టార్గెట్ చేసుకుని 300-400 డ్రోన్స్ తో ఈ దాడులకు పాల్పడినట్లు భారత సైన్యం తెలిపింది. పాకిస్థాన్ తమ పౌర విమానాలను డిఫెన్స్ షీల్డ్ లా ఉపయోగించుకుంటోందని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లు కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాధమిక నివేదిక ప్రకారం టర్కీకి చెందిన ‘ఆసిస్ గార్డ్ సోంగర్’ డ్రోన్స్ ప్రయోగించినట్లు తెలిపారు. పాక్ దాడులను భారత్ విజయవంతంగా అడ్డుకుందని తెలిపారు. పాక్ కుయుక్తులను ఎండగట్టారు. అప్రమత్తంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.
పాక్ డ్రోన్స్ ఎటాక్ ను సమర్థవంతంగా తిప్పి కొట్టాం: వెల్లడించిన భారత్
By admin1 Min Read