కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎలక్షన్ కమీషన్ పై తన విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేశారు. డిజిటల్ ఓటర్ల లిస్ట్ ను విడుదల చేయాలన్న తన డిమాండ్కు ప్రజల నుంచి కూడా మరింత మద్దతు కోసం ‘ఓట్ చోరీ’ పేరుతో నేడు ఒక వెబ్సైట్ను ప్రారంభించారు. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని, దానిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ మద్దతు అందించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఇక ఈ ప్రచారానికి సంబంధించి రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియోను పంచుకున్నారు. “ఓట్ చోరీని బయటపెట్టడం చాలా కీలకమని అన్నారు. ఈ ప్రచారానికి మద్దతివ్వాలని కోరారు. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటమని అన్నారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలకు స్వచ్ఛమైన లిస్ట్ అత్యంత ఆవశ్యకమని ప్రజలు, పార్టీలు ఓటర్ల లిస్ట్ ను తనిఖీ చేసేందుకు వీలుగా ఈసీఐ పారదర్శకంగా వ్యవహరించి డిజిటల్ ఓటర్ల లిస్ట్ ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రచారానికి మద్దతుగా votechori.in వెబ్సైట్ ను సందర్శించాలని లేదా 9650003420 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు.
Vote Chori is an attack on the foundational idea of 'one man, one vote'.
A clean voter roll is imperative for free and fair elections.
Our demand from the EC is clear – be transparent and release digital voter rolls so that people and parties can audit them.
Join us and… https://t.co/4V9pOpGP68
— Rahul Gandhi (@RahulGandhi) August 10, 2025