ఝార్ఖండ్,మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్కు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.రేపు మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.అయితే ఝార్ఖండ్ రెండో విడతలో 38 స్థానాలకు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.మహారాష్ట్ర 288 స్థానాలకుగాను మొత్తం 4,136 మంది అదృష్టం పోటీ చేస్తున్నారు.వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.కాగా మహారాష్ట్రలో 9,63,69,410 మంది ఓటర్లు ఉన్నారు.అందుకే 1,00,186 పోలింగ్ బూత్లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఝార్ఖండ్లోని 38 నియోజకవర్గాల్లో రెండో విడత ప్రచారం నిన్న సాయంత్రం ముగిసింది.రెండో విడతలో 38 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది.అయితే 38 నియోజకవర్గాల్లో 522 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీగా బలగాలను మోహరిస్తోంది.ఝార్ఖండ్లో మొత్తం 81 శాసనసభ స్థానాలు ఉన్నాయి.వాటిలో మొదటి విడతలో ఈనెల 13న 43 స్థానాలకు పోలింగ్ జరిగింది.43 స్థానాలకు 683 మంది అభ్యర్థులు పోటీపడగా 66.18 శాతం పోలింగ్ నమోదైంది.ఝార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ కలిసి మహాఘట్బంధన్గా పోటీ చేస్తుండగా, బీజేపీ, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జేడీయూ, లోక్జన్ శక్తి రామ్ విలాస్ పార్టీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి.