ఢిల్లీలోని సీనియర్ సిటిజన్స్ అందరికీ అన్ని ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈమేరకు హామీ ఇచ్చింది. మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ‘సంజీవని యోజన’ కింద ఉచిత వైద్యం అందిస్తామని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. వయోవృద్ధుల సంరక్షణ తమ బాధ్యత అని పేర్కొన్నారు. వారు కష్టపడి పనిచేసే దేశాన్ని ముందుకు తీసుకొచ్చారని వివరించారు. సీనియర్ సిటిజన్స్ వైద్యానికి అయ్యే ఖర్చుకు గరిష్ట పరిమితి ఏమీ లేదని స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు