విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ మహాసభలు జరిగే ప్రాంగణానికి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టడం ఆ మహానుభావుడు తెలుగు జాతి కోసం చేసిన అద్వితీయ త్యాగాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తోందని పేర్కొన్నారు. అలాగే ప్రధాన వేదికకు తెలుగు భాషాభివృద్ధి కోసం గణనీయ కృషి చేసిన రామోజీరావు గారి పేరు పెట్టడం కూడా అభినందనీయమని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఈ మహాసభలకు విచ్చేసిన అతిథులకు, పాల్గొంటున్న తెలుగుభాషాభిమానులకు అందరికీ ధన్యవాదాలు. ఈ మహా సభలు విజయవంతం అవ్వాలని కోరుకుంటూ…. నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
తెలుగు రచయితల మహాసభలు నిర్వహించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read

