ప్రగతి – పారదర్శకత – సుస్థిరత – జవాబుదారీతనం నాలుగు స్తంభాలుగా ప్రజలు ఎన్నుకున్న మంచి ప్రభుత్వంలో పిఠాపురం ఎమ్మెల్యేగా , రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రిగా నేతృత్వంలో గత ఆరున్నర నెలల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల సమాహారం సమగ్ర అభివృద్ధి నివేదిక – 2024 పేరిట విడుదల చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారం లోకి వచ్చిన ఈ ఆరున్నర నెలల్లో తాను ఏం చేశాననే వివరాలను డిప్యూటీ సీఎం ‘ఎక్స్’ లో షేర్ చేశారు. ఇందులో భాగంగా రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో పేదల పెళ్లిళ్ల కోసం టీటీడీ కళ్యాణ మండపం, సీహెచ్ సీని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్, రూ.72 లక్షలతో గొల్లప్రోలులో తాగునీటి సౌకర్యం, 32 స్కూళ్లకు క్రీడా కిట్ల పంపిణీ, పాఠశాలలు, కాలేజీల్లో ఆర్ ప్లాంట్లు సహా మరికొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. అలాగే డిప్యూటీ సీఎంగా రాష్ట్రానికి తను చేసిన అభివృద్ధి గురించి సమగ్రంగా వివరించారు.
సమగ్ర అభివృద్ధి నివేదిక – 2024
ప్రగతి – పారదర్శకత – సుస్థిరత – జవాబుదారీతనం నాలుగు స్తంభాలుగా ప్రజలు ఎన్నుకున్న మంచి ప్రభుత్వంలో పిఠాపురం MLA గా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రిగా… pic.twitter.com/yptPF9ghhx
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) January 1, 2025