తిరుచానూరులో ఇంటింటికి న్యాచురల్ గ్యాస్ సరఫరాను ఏపీ సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించారు. అనంతరం వాణిజ్య వాహనాలు, ఆటో రిక్షాలు, సీఎన్జీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. నాడు దీపం 1 ద్వారా ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చినట్లు వివరించారు. నేడు దీపం 2 ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మరొక్క అడుగు ముందుకు వేసి, 24 గంటలు గ్యాస్ సరఫరా అయ్యేలా, నేరుగా పైప్ లైన్ ద్వారా నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రారంభించినట్లు తెలిపారు. ఏపీ త్వరలో గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారవుతుందని తెలిపారు. మన రాష్ట్రంలో పుష్కలంగా సహాజవనరులు ఉన్నాయన్నారు. హైవే లు, పోర్టులు, పొడవైన సముద్ర తీరం, ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయని వివరించారు. ఇంటింటికి గ్యాస్ సరఫరా కోసం 5 కంపెనీలను సంప్రదించినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

