ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబు పలువురు మంత్రుల బృందం దావోస్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక సదస్సులో అంతర్జాతీయ పారిశ్రామిక ప్రముఖులు, దిగ్గజ సంస్థల అధినేతలతో వీరు సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల కల్పనకు ఉన్న అవకాశాలను వివరించారు. కాగా, దావోస్ లో జరిపిన చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఏపీ సీఎస్ కె. విజయానంద్, సీఎంవో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మూడు రోజులపాటు దావోస్ లో జరిపిన చర్చల సారాంశాన్ని వారికి వివరించారు. త్వరలో దేశ, విదేశీ ప్రతినిధులు, సంస్థల సీఈవోలు రాష్ట్రంలో పర్యటించనున్నారని, దానికి తగినట్లుగా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. వాటిని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించాలని వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు