ఆక్వా రైతుల కష్టాలపై తమ పార్టీ నాయకుల ఆందోళన, తన ట్వీట్ తర్వాత ఎట్టకేలకు సీఎం చంద్రబాబు ఒక సమావేశం పెట్టినందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. కాని, పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదని ఆయా జిల్లాలకు చెందిన నాయకులు తన దృష్టికి తీసుకు వచ్చారని జగన్ పేర్కొన్నారు. మీ సమావేశాలు, మీరు చేస్తున్న ప్రకటనలు ప్రచారం కోసం కాకుండా ఆక్వా రైతులకు నిజంగా మేలు చేసేలా ఉండాలని సూచించారు. ఆక్వా రైతుల పెట్టుబడిలో రొయ్యలకు వేసే మేత ప్రధానమైనదని గతంలో కంటే ముడిసరుకుల రేట్లు పడిపోయినప్పుడు ఫీడ్ రేట్లు కూడా తగ్గాలి కదా? ఎందుకు తగ్గడంలేదు? ఈ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు.
100 కౌంట్ రొయ్యలకు రూ.270ల రేటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఎంపెవరింగ్ కమిటీ ఉండేది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలిచేది. ఇలాంటి వ్యవస్థలను ఇప్పుడు అచేతనంగా మార్చేశారు. వెంటనే దీన్ని పునరుద్ధరిస్తూ రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని జగన్ అన్నారు.
చేస్తున్న ప్రకటనలు ప్రచారం కోసం కాకుండా ఆక్వా రైతులకు మేలు చేసేలా ఉండాలి: మాజీ సీఎం వైఎస్ జగన్
By admin1 Min Read