రాష్ట్ర హోమ్, విపత్తు నిర్వహణల శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు బాధ్యతల నిర్వహణలో చూపుతున్న చొరవ, బాధితులకు బాసటగా నిలుస్తున్న తీరు అభినందనీయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఏ సమయంలోనైనా స్పందించడమే కాదు, శోకంలో ఉన్నవారికి సాంత్వన చేకూర్చాలి. శ్రీమతి అనిత గారు ఆ విధంగానే స్పందిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. సింహాచలం దుర్ఘటన విషయం తెలియగానే తెల్లవారుజామున 3 గం.కే ఘటన ప్రదేశానికి చేరుకొని పరిస్థితులు సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మృతులు, క్షతగాత్రుల సంబంధీకులతో మాట్లాడి ఓదార్చారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబానికి శ్రీమతి అనిత వెన్నంటి ఉండి మనో ధైర్యం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, బాధితులకు ఎలా భరోసా ఇస్తుందో చెప్పడానికి మంత్రి అనిత బాధ్యతల నిర్వహణ ఒక తార్కాణమని పేర్కొన్నారు.
విపత్కర పరిస్థితుల్లో హోం మంత్రి అనిత గారి బాధ్యతలు నిర్వహణ అభినందనీయం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
By admin1 Min Read