టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఈరోజు మహానాడు 2025 ప్రాంగణంలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు ‘యువగళం’ పాదయాత్ర కాఫీ టేబుల్ బుక్ను అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ తన పాదయాత్ర అనుభవాలను, ప్రజల ఆదరాభిమానాలను గుర్తుచేసుకున్నారు.
ఈ పుస్తకాన్ని తనకు స్ఫూర్తిప్రదాత అయిన చంద్రబాబుకు అందించడం ఎంతో సంతోషంగా ఉందని లోకేష్ తెలిపారు. పుస్తకంలోని అనేక కథనాలు, చిత్రాలు తనకు గత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నాయని, అదే సమయంలో తనపై ఉంచిన అపారమైన బాధ్యతను కూడా గుర్తుకు తెస్తున్నాయని ఆయన వివరించారు. యువగళం పాదయాత్ర ఆసాంతం తనకు అండగా నిలిచి, తనపై ప్రేమ, ఆప్యాయతలను కురిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నారా లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం చంద్రబాబుకు ‘యువగళం’ పాదయాత్ర కాఫీ టేబుల్ బుక్ను అందజేసిన మంత్రి లోకేష్
By admin1 Min Read