ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో సచివాలయం సమీపంలో అమరావతి ఫస్ట్ సమ్మిట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు జనాభా పెరుగుదల ఆవశ్యకతను వివరించారు. జనాభా భారం కాదని, ఆస్తి అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుత కాలంలో జనాభా నియంత్రణ కాదు నిర్వహణ అవసరమని పేర్కొన్నారు. దక్షిణాదిలో జనాభా తగ్గుదల వల్ల నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంట్ సీట్లు కూడా తగ్గుతాయనే చర్చ జరుగుతోందన్నారు. జనాభా ప్రత్యుత్పత్తి రేటులో 1.8 శాతంగా ఉన్న ఏపీ 2.1 శాతానికి చేరుకోవాలని అన్నారు. వికసిత్ భారత్-2047లక్ష్య సాధనకు జనాభా పెరుగదల ఎంతో కీలకమని చంద్రబాబు అన్నారు. రాబోయే 20 ఏళ్లలో వచ్చే పెనుమార్పులకు అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమ్మిళిత వృద్ధే జనాభా పెరుగుదలకు సరైన మార్గమన్న సీఎం జనాభా పెరుగుదలకు మంచి పాలసీని తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు