పేదరికాన్ని సమూలంగా, శాశ్వతంగా నిర్మూలించాలనే మంచి లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పీ4 విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈరోజు జరిగిన పీ4 అమలు కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మొదటి దశలో 15 లక్షల బంగారు కుటుంబాల ఎంపికపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మార్గదర్శుల ఎంపికపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించారు. పీ4 సంబంధిత మార్గదర్శులతో ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈరోజు పీ4 పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పీ4 చాలామంది జీవితాల్లో గొప్పమార్పు అవుతుందని స్పష్టం చేశారు. ఇంటర్ పాస్ అయిన అమ్మాయికి రెండు నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి నెలలో ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించామని వివరించారు. ఆ అమ్మాయి భవిష్యత్తులో మార్గదర్శి కావాలని కోరుకుంటుందని తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు