ఎదుటివారికి, సమాజానికి సేవ చేయడం అనేది మన సంస్కృతిలో భాగం. అందుకే మనది పుణ్యభూమి అయ్యిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. “పరోపకారం పరమో ధర్మః” అనేది మన భారతీయ ధర్మం. మనం బాగుండాలి.. మనతో పాటు నలుగురు బాగుండాలని నాడు “జన్మభూమి” కార్యక్రమం చేపట్టి సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో నేడు “జీరో పావర్టీ – పీ4” కార్యక్రమాన్ని తలపెట్టామని పేర్కొన్నారు. దీనికి వస్తున్న స్పందన ఎంతో సంతృప్తినిస్తోందని అన్నారు. ఇటీవల ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి 121 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇలాంటి భూరి విరాళాలు టీటీడీ చేపట్టే విద్యా, వైద్యం వంటి సేవలకు ఎంతో ఉపకరిస్తుంది. ఎన్నో సత్కార్యాలకు దోహద పడుతుందని చెప్పారు. డబ్బు సంపాదన కంటే…దాన్ని తిరిగి సమాజంపై ఖర్చు చేయడమే ఎక్కువ తృప్తిని, నిజమైన సంతోషాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే సమాజంలో సంపద సృష్టించిన ప్రతి ఒక్కరూ మంచి మనసుతో తిరిగి సమాజం కోసం వెచ్చించేందుకు ముందుకు రావాలని కోరారు. ఇదో గొప్ప ఆదర్శంగా నిలిచి ఎన్నో మార్పులకు నాంది పలకాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
ఇదో గొప్ప ఆదర్శంగా నిలిచి ఎన్నో మార్పులకు నాంది పలకాలి: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read