అదానీ జగన్ సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం ఏసీబీని పంజరంలో బంధించిందని ఆరోపించారు. టీడీపీ బోను నుండి ఏసీబీని విడుదల చేసి స్వేచ్చగా పనిచేసే ఆదేశాలు ఇవ్వండి. అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెడితే.. చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.
అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని సోలార్ పవర్ డీల్ లో జగన్ కి రూ.1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని అన్నారు. ఈ విషయాన్ని అమెరికా FBI వెల్లడించింది. ఆధారాలు కూడా బయట పెట్టింది. ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా ? 2021లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ సోలార్ డీల్ పై హైకోర్టు లో పిటీషన్ కూడా వేసింది. ఇదొక కుంభకోణం అని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు.మరి ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. అధికారం చేతుల్లో పెట్టుకొని ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. జగన్ కి నష్టం లేదు..మీకు నష్టం లేదు. నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకు మాత్రమేనని షర్మిల మండిపడ్డారు. ఒకప్పుడు సోలార్ పవర్ యూనిట్ కి 10 రూపాయలు ఉండేది. ఇప్పుడు యూనిట్ ధర 1.99 పైసలకు తగ్గింది. రేపు 50 పైసలకే వచ్చినా తగ్గొచ్చు. సోలార్ పవర్ రేట్లు తగ్గుతుంటే… మీరు ఎలా 25 ఏళ్లకు అగ్రిమెంట్ చేశారు..? అని ప్రశ్నించారు. రూ.2.49 పైసలకు కొని రాష్ట్ర ప్రజలు నెత్తిన లక్ష కోట్ల భారం ఎందుకు భారం మోపారని షర్మిల నిలదీశారు.ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి. ప్రజల కోసం పని చేసే ఏసీబీని స్వేచ్చగా పనిచేసే ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
జగన్ కి నష్టం లేదు..మీకు నష్టం లేదు. నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకు మాత్రమే: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin1 Min Read
Previous Articleఅమరావతిలో బిట్స్ క్యాంపస్ …?
Next Article పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ ప్రయోగం విజయవంతం