ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో అమరావతిల రాజధాని అభివృద్ధి పనులు వేగంగా అడుగులు పడుతున్నాయి.దీనితో గత 5 ఏళ్లుగా రాజధాని అంశంలో నెలకొన్న గందరగోళానికి తెరదించింది.ఈ మేరకు అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు,సంస్థలు ఏర్పాటు చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.ఈ నేపథ్యలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) తన క్యాంపస్ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని సమాచారం.రాజస్థాన్లోని పిలానీలో ఉన్న బిట్స్ విద్యాలయానికి ఇప్పటికే గోవా,హైదరాబాద్,దుబాయ్లలో క్యాంపస్లు ఉండగా,తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనూ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే అన్ని హంగులతో యాభై ఎకరాల విస్తీర్ణంలో అమరావతిలో క్యాంపస్ ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు.ఈమేరకు బిట్స్ ప్రతినిధులు నిన్న సీఆర్డీఏ అధికారులతో కలిసి కురగల్లులోని ఎస్ఆర్ఎం సమీపంలో,వెంకటాయపాలెంలోని బైపాస్ వద్ద స్థలాలను పరిశీలించారు.యాజమాన్యంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బిట్స్ ప్రతినిధులు తెలిపారు.