వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో 211 పరుగులు తేడాతో విజయం సాధించి రికార్డు విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు తాజాగా జరిగిన రెండో మ్యాచ్ లో 115పరుగుల తేడాతో భారీ విజయం సాధించి 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. రెండో సారి తన అత్యధిక పరుగులను నమోదు చేసింది. హార్లిన్ డియోల్ 115 (103; 16×4) సెంచరీతో సత్తా చాటింది. ప్రతీక రావెల్ 76(86;10×4, 1×6), స్మృతి మంథాన 53 (47; 7×4, 2×6), జెమీమా రోడ్రిగ్స్ 52 (36; 6×4, 1×6) హాఫ్ సెంచరీలతో కదంతొక్కడంతో భారీ స్కోరు సాధించింది. వెస్టిండీస్ బౌలర్లలో ఫ్లెచర్, జైదా జేమ్స్, కియానా జోసెఫ్, డాటిన్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక భారీ స్కోరు ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటయింది. కెప్టెన్ హెలే మ్యాథ్యూస్ 106(109; 13×4) సెంచరీతో రాణించింది. క్యాంప్ బెల్ 38 (48;5×4) ఫర్వాలేదనిపించింది. మిగతా బ్యాటర్ లు ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 3 వికెట్లు, దీప్తి శర్మ 2, టైటాస్ సాధు 2, ప్రతీక రావల్ 2, రేణుకా ఠాకూర్ సింగ్ 1 వికెట్ తీశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు