భారత మహిళా క్రికెట్ జట్టు సొంతగడ్డపై అప్రతిహతంగా విజయాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా ఐర్లాండ్ పై జరుగుతున్న వన్డే సిరీస్ లో మొదటి మ్యాచ్ విజయంతో ఈ సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగులు చేసింది. కెప్టెన్ గాబీ లూయిస్ 92 (129; 15×4), లీ పాల్ 59 (73; 7×4) మంచి ప్రదర్శన కనబరిచారు. భారత బౌలర్లలో ప్రియ మిశ్రా (2/56) రెండు వికెట్లతో ఆకట్టుకుంది. లక్ష్య ఛేదనలో ప్రతీక రావల్ 89( 96 బంతుల్లో 10×4, 1×6) రాణించడంతో భారత్ 4 వికెట్లు కోల్పోయి 34.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. తేజల్ హసబ్నిస్ 53 నాటౌట్(46; 9×4), కెప్టెన్ స్మృతి మంధాన 41 (29; 6×4, 1×6) కూడా పర్వాలేదనపించారు. ప్రతీక రావల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలిచింది. ఐర్లాండ్ బౌలర్లలో ఐమీ మాక్వెర్ (3/57) రాణించింది. రెండో వన్డే ఆదివారం జరగనుంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

