ఎంపీ ప్రియ సరోజ్ భారత క్రికెటర్ రింకు సింగ్ పెళ్లికి సంబంధించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యుల నుండి స్పష్టత వచ్చేసింది. వారిరువురూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రియ తండ్రి ఎమ్మెల్యే తుఫాని సరోజ్ స్పష్టం చేశారు. ప్రియతో రింకు నిశ్చితార్థం జరిగిందని ఇటీవల వచ్చిన వార్తలను ఖండించిన ఆయన.. రింకూ కుటుంబ సభ్యులతో చర్చలు జరుగుతున్నాయని మాత్రమే అప్పుడు తెలిపారు. అయితే తాజాగా ఈ ఇద్దరి పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. రింకూ, ప్రియకు ఏడాది ముందు నుంచే పరిచయం ఉంది. వాళ్లిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారని కానీ పెళ్లి చేసుకోవడానికి ఇరు కుటుంబాల అంగీకారం కోసం ఎదురు చూశారు. వీళ్ల వివాహానికి రెండు కుటుంబాలు ఒప్పుకొన్నాయని తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు