భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన భారత స్పిన్నర్గా నిలిచాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఈ 33 ఏళ్ల భారత స్పిన్నర్ 14 వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా ఒక టీ20 సిరీస్లో ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్ జేసన్ హోల్డర్ 15 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 2021లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధీ 13 వికెట్లు పడగొట్టగా ఇప్పుడు అతనిని వరుణ్ చక్రవర్తి అధిగమించాడు. ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ ను భారత్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్ లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.
ఒక ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి
By admin1 Min Read
Previous Articleఉమ్మడి ఏపీ విభజన అంశాలపై కీలక సమావేశం
Next Article కన్నప్పలో ప్రళయ కాల రుద్రుడిగా ప్రభాస్…!