ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా మాస్టర్స్ ఉత్కంఠభరితంగా సాగిన టోర్నీ తొలి మ్యాచ్లో 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 4 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఓపెనర్లు సచిన్ (10), అంబటి రాయుడు (5) విఫలమైనా స్టువర్ట్ బిన్నీ 68 (31; 3×4, 7×6), యూసుఫ్ పఠాన్ 56 నాటౌట్; (22; 3×4, 6×6), గుర్కీరత్ 44(32; 7×4), యువరాజ్ 31 నాటౌట్ (22 బంతుల్లో 2×4, 2×6) దూకుడైన ఆటతీరుతో జట్టు భారీ స్కోరు సాధించింది. అనంతరం లంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 218 పరుగులు మాత్రమే చేసింది. సంగక్కర (51), జీవన్ మెండిస్ (42), గుణరత్నె (37) రాణించారు. ఇర్ఫాన్ పఠాన్ (3/39), ధవళ్ కులకర్ణి (2/34) బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టడి చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు