బ్రెజిల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ లో భారత బాక్సర్ హితేష్ 70 కేజీల విభాగంలో ఫైనల్ కు దూసుకెళ్లాడు. సెమీ ఫైనల్ లో హితేష్ 5-0 తో ఫ్రాన్స్ కు చెందిన మకాన్ ట్రార్ పై విజయం సాధించాడు. ఫైనల్ లో ఇంగ్లాండ్ కు చెందిన ఒడెల్ కమరా తో తలపడతాడు. మరోవైపు 50 కేజీల విభాగం సెమీస్ లో జదుమణి సింగ్ ఉజ్బెకిస్తాన్ కు చెందిన ఆసియా అండర్-22 ఛాంపియన్ అసిల్ బెక్ చేతిలో 2-3 తో ఓడిపోయాడు. 90 కిలోల విభాగంలో విశాల్ ఉజ్బెకిస్తాన్ కు చెందిన టురాబెక్ చేతిలో, 60 కిలోల విభాగంలో సచిన్ పోలాండ్ కు చెందిన పావెల్ బ్రాచ్ చేతిలో ఓడిపోయారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు