ముంబై ఇండియన్స్:215-7 (20).
లక్నో సూపర్ జెయింట్స్:161-10 (20).
ఐపీఎల్ సీజన్ 18 లో ముంబై ఇండియన్స్ మరో విజయం నమోదు చేసింది. నేడు వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 54 పరుగుల తేడాతో గెలిచింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ముందు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు చేసింది. రికెల్టన్ 58 (32; 6×4, 4×6), సూర్య కుమార్ యాదవ్ 54 (28; 4×4, 4×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. విల్ జాక్స్ (29), నమన్ ధీర్ (25 నాటౌట్), కార్బిన్ బాస్ (20) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ 2 వికెట్లు, ఆవేష్ ఖాన్ 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటయింది. ఆయుష్ బదోనీ (35), మిచెల్ మార్ష్ (34), నికోలస్ పూరన్ (27), డేవిడ్ మిల్లర్ (24) పరుగులు చేశారు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ లక్నో పై పైచేయి సాధించారు. బుమ్రా 4 వికెట్లు, బౌల్ట్ 3 వికెట్లు, విల్ జాక్స్ 2 వికెట్లు, బాష్ 1 వికెట్ పడగొట్టారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు