భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో పునరాగమనం చేయన్నారు. గాయం కారణంగా ఆటకు దూరమైన ఈ సూపర్ జోడి మళ్లీ సత్తా చాటాలని భావిస్తున్నారు. సాత్విక్ భుజానికి గాయంతో పారిస్ ఒలింపిక్స్ అనంతరం ఈ జోడీ బరిలో దిగలేదు. గాయం నుంచి సాత్విక్ పూర్తిగా కోలుకోవడంతో నేటి నుండి ప్రారంభంకానున్న చైనా మాస్టర్స్లో భారత జోడీ బరిలోకి రానుంది.
పురుషుల డబుల్స్ మొదటి రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన లీ హ్యూ- యాంగ్ సువాన్ డబుల్స్ తో ఆరో సీడ్ సాత్విక్- చిరాగ్ జోడీ తలపడనుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మలేషియాకు చెందిన లీ జియా తో లక్ష్యసేన్, ఇండోనేసియాకు చెందిన చికో వార్డోయో తో ప్రియాన్షు రజావత్ తలపడనున్నారు. మహిళల సింగిల్స్లో బుసానన్తో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు, డెన్మార్క్ కు చెందిన లైన్ హోజ్మార్క్ తో మాళవిక బాన్సోద్, తొమొక మియజాకి (జపాన్)తో ఆకర్షి కశ్యప్, బీవెన్ జాంగ్ (అమెరికా)తో అనుపమ పోటీ పడుతున్నారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో లింగ్ ఫాంగ్- జెంగ్ యు చైనీస్ తైపీ జోడిల తో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ప్రెస్లీ స్మిత్- జెనీల అమెరికా ద్వయంతో సుమీత్రెడ్డి- సిక్కిరెడ్డి తలపడతారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు