బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోర్ 12-3తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ భారత బౌలర్ల ధాటికి పరుగులకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేయగా.. ఆసీస్ 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 7 వికెట్లు కోల్పోయి 486 పరుగులు చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని 534 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు భారత బౌలింగ్ ముందు నిలువలేక పోయారు. లక్ష్య ఛేదనలో 238 పరుగులకు ఆలౌటయింది. టాప్ ఆర్డర్ ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు.
నాథన్ (0), పాట్ కమ్మిన్స్ (2), లబుషేన్ (3), ఉస్మాన్ ఖవాజా (4), ట్రావిస్ హెడ్ (89), మార్ష్ (47)లు కొద్దిసేపు నిలకడగా ఆడారు. అలెక్స్ క్యారీ (36) పోరాడాడు. స్టార్క్ (12), లైయన్ (0), హేజల్ వుడ్ (4 నాటౌట్) పెద్దగా పరుగులు చేయలేకపోయారు.
భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు, హార్షిత్ రాణా, నితీష్ రెడ్డి ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. దీంతో ఈ సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు