ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కొద్ది రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. 2025 ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కాగా, భధ్రతా కారణాలు రీత్యా బీసీసీఐ భారత జట్టును అక్కడికి పంపేందుకు నిరాకరించింది. భారత్ ఆడే మ్యాచ్ లు హైబ్రిడ్ పద్దతిలో నిర్వహించే విధంగా ఐసీసీ, బీసీసీఐ ప్రతిపాదించగా.. పాకిస్థాన్ మాత్రం మొత్తం మ్యాచ్ లు తమ దేశంలోనే జరగాలని పట్టుబడుతోంది. తాజాగా జరిగిన ఐసీసీ సమావేశంలోనూ ఇదే వైఖరితో పాక్ ఉండడంతో ఐసీసీ పాక్ కు తేల్చి చెప్పింది. హైబ్రిడ్ మోడల్ కు అంగీకరిస్తే సరేనని లేకుంటే నిర్వహణ నుండి తప్పుకోవాలని సూచించింది. హైబ్రిడ్ మోడల్ కు అంగీకరిస్తే తటస్థ వేదికపై యూఏఈలో మ్యాచ్ లు జరుగుతాయి. హైబ్రిడ్ మోడల్ ఒకటే పాక్ లో మ్యాచ్ లు జరిగేందుకు పరిష్కారమని ఐసీసీ పాక్ కు తెలిపింది. భారత్ ఒకవేళ ఆడకపోతే ఆ ప్రభావం ట్రోఫీపై తీవ్రంగా ఉంటుంది. దీంతో ఐసీసీ పాక్ కు తేల్చి చెప్పింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు