బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు (డే/నైట్) మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 180 పరుగులకు ఆలౌటయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 44.1 ఓవర్లలో 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. నితీష్ రెడ్డి 42 (54; 3×4, 3×6) టాప్ స్కోరర్. కే..ఎల్.రాహుల్ 37 (64;6×4),గిల్ 31 (51; 5×4), అశ్విన్ 22(22; 3×4) , పంత్ 21(35;2×4) పర్వలేదనిపించారు. జైశ్వాల్ 0, రోహిత్ శర్మ (3), కోహ్లీ (7) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో చెలరేగాడు. పాట్ కమ్మిన్స్ 2 వికెట్లు, స్కాట్ బొలాండ్ 2 వికెట్లు తీశారు.
భారత్ బ్యాటింగ్:
యశస్వీ జైశ్వాల్ (0(, కే.ఎల్.రాహుల్ 37 (64;6×4), శుభ్ మాన్ గిల్ 31 (51; 5×4), విరాట్ కోహ్లీ 7(8;1×4), రిషబ్ పంత్ 21(35;2×4), రోహిత్ శర్మ (3), నితీష్ రెడ్డి 42 (54; 3×4, 3×6), రవిచంద్రన్ అశ్విన్ 22(22; 3×4), హార్షిత్ రాణా (0), సుమత్రా (0), సిరాజ్ 4 నాటౌట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 180 పరుగులకు భారత్ ఆలౌట్
By admin1 Min Read