విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.ఇక నుండి దేశీయ,అంతర్జాతీయ విమానాల్లో వైఫై సేవలు ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది.కాగా విమానాల్లో ఈ సేవలు అందిస్తున్న తొలి విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా సంస్థ రికార్డుకు ఎక్కనుంది.అయితే వైఫై సేవలు అందుబాటులోకి వస్తే ఇక సమయం తెలియకుండానే ప్రయాణాన్ని ఆస్వాదించే అవకాశం దక్కుతుందని ప్రయాణికులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.ఈ సర్వీసులు శాటిలైట్ కనెక్టివిటీ,బ్యాండ్విడ్త్,విమానం ప్రయాణించే మార్గం,ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా ఉంటాయని ఎయిర్ ఇండియా పేర్కొంది.
ఈ వైఫై సేవలతో ల్యాప్టాప్స్,ట్యాబ్లెట్స్, స్మార్ట్ఫోన్స్ను విమానంలో ఉపయోగించుకోవచ్చు.10 వేల అడుగుల ఎత్తున కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకునే వీలు కలుగుతుంది.ప్రస్తుతం ఎయిర్బస్ ఏ-350,ఎయిర్బస్ ఏ-321 నియో, బోయింగ్ 787-9 వంటి న్యూయార్క్,లండన్,పారిస్,సింగపూర్ వెళ్లే విమానాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తారు.అనంతరం దశలవారీగా దేశీయ విమానాల్లో వైఫై సేవలు ప్రారంభిస్తారని తెలుస్తుంది.

